BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 05:07 PM
31 వీక్షణలు

తిరువూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో ఏ. కుమార్ జాతీయ జెండాను ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆర్డీవో మాట్లాడుతూ.. దేశం స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక సందర్భంగా ప్రతి పౌరుడు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ.. విద్యార్థులు దేశభక్తి భావంతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ వంటి విలువలను అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలుసుకుని, వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటారు.

కార్యక్రమంలో తహసీల్దార్ డీ. చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ మనోజ్, డీవైఓ శ్యాంసుందర్, ఎస్సైలు శాతకర్ణి, గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.