BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

తిరువూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:23 PM
28 వీక్షణలు

తిరువూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ ఆధ్వర్యంలో శనివారం తిరువూరులో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రాజుపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

అమ్మ ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమాల్లో అనాథలు, వృద్ధులు, బాలలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

ఈ కార్యక్రమాల్లో జనసేన సీనియర్ నాయకులు రావుల రాజేందర్, నంబూరి శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల ప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలె శాంతి, సింగం శెట్టి రాంబాబు, ఉయ్యూరు జయప్రకాష్, పెరుమాళ్ల మనోజ్, బెల్లంకొండ సుధీర్, టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ హనీ తదితరులు పాల్గొన్నారు.