BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరులో మూడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం.. రూ.6 కోట్లతో పనులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
58 వీక్షణలు

తిరువూరు, జూన్ 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరుకు కృష్ణా జలాలను అందించే సుమారు రూ.240 కోట్ల తాగునీటి ప్రాజెక్టులో భాగంగా నడిం తిరువూరు, రాజుపేట, పి.టి. కొత్తూరు ప్రాంతాల్లో మూడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు సర్వే నంబర్ 205/1లో ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పట్టణ ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్యాంకుల నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు.

పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరువూరు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్, టీపీవో నాగమల్లేశ్వరరావు, ఏఈ లోకేష్, ముత్యాల మధు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.