తిరువూరులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు కుట్టుమిషన్ వితరణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరువూరు ప్రధాన శాఖ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ను వితరణగా అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ ముఖ్య నిర్వాహకుడు రాజేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలకు కుట్టుమిషన్ అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది సంఘం ప్రాంతీయ కార్యదర్శి బి.ఎల్.హెచ్. ప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.