BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 11:55 AM
70 వీక్షణలు

తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత

తిరువూరు, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాటక రంగ కళాకారుడు, గాయకుడు, ఫోటోగ్రాఫర్ వాణి రంగారావు (75) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తిరువూరు ప్రాంతంలో కళాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

రంగారావు తిరువూరులో వాణి ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటోగ్రఫీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మనిషిని చూసి అద్భుతంగా చిత్రాలు గీయడంలో ఆయనకు విశేష నైపుణ్యం ఉండేది. నాటక రంగంలో నటుడిగా, గాయకుడిగా తనదైన ముద్ర వేశారు.

ముఖ్యంగా ప్రముఖ గాయకుడు ఘంటసాల ఆలపించిన పాటలు, భగవద్గీతను ఆయన ఆలపించిన తీరు ఘంటసాల స్వరాన్నే తలపించేలా ఉండేదని అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అనేక సంస్థలు ఘనంగా సన్మానించాయి.

సుమారు ఏడాది క్రితం గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో రంగారావును ఘనంగా సత్కరించినట్లు కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

ఎవరు ఆహ్వానించినా సంతోషంగా కార్యక్రమాలకు హాజరై కళాభిమానులను అలరించే వ్యక్తిగా రంగారావు పేరు పొందారని, ఆయన మరణం నాటక కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు, అభిమానులు పేర్కొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.