తిరువూరులో ఉత్తమ ఆర్డీవో కె. కుమార్కు ఘన సన్మానం
తిరువూరులో ఉత్తమ ఆర్డీవో కె. కుమార్కు ఘన సన్మానం
తిరువూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ ఆర్డీవో అవార్డు అందుకున్న కె. కుమార్ను ఆర్యవైశ్య ప్రముఖులు శనివారం తిరువూరులో ఘనంగా సన్మానించారు.
ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ లక్ష్మీశా చేతుల మీదుగా ఉత్తమ ఆర్డీవో అవార్డు అందుకున్న కె. కుమార్ను ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ.. తిరువూరు ఆర్డీవోగా కె. కుమార్ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవ, పరిపాలనలో నిబద్ధత, ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం తిరువూరు ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఉత్తమ ఆర్డీవోగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కె. కుమార్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అభినందించిన ఆర్యవైశ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొని కె. కుమార్కు అభినందనలు తెలిపారు.