BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

తిరువూరులో విద్యుత్ అమరవీరుల దినోత్సవం.. అమరులకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 12:33 PM
20 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో

విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న వామపక్షాలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో బషీరాబాగ్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని శుక్రవారం తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా సాగిన విద్యుత్ ఉద్యమ ఫలితంగా చాలాకాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా నిలిచాయని అన్నారు.

గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.