BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 06:59 pm
Posted by : కూనురు మధు

​తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Aug, 2026 - 06:59 PM
181 వీక్షణలు

​​తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా 

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.