తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక గ్రామానికి కంబాలపల్లి సాయిచరణ్ (23) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటుండటం తో ఏదైనా పని చూసుకుని స్థిరపడవచ్చు కదా" అని తండ్రి అంజయ్య అతడిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిచరణ్ సోమవారం రాత్రి అందాజగా 08:30 గంటల సమయంలో ఎవరూ లేని తమ పాత ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు అని తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.