BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

ఓటరు జాబితా సవరణపై ఇంటింటి ప్రచారం – ఎన్యూమరేషన్ ఫార్మ్‌లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:41 PM
21 వీక్షణలు

ఓటర్లు జూలై 14 వరకు జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బీ ఎల్ ఓల ద్వారా తమ పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫార్మ్‌లను నింపి అందజేసి, తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చనుబండ పీ ఏ సీ ఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా చాట్రాయి మండలం చనుబండ గ్రామం బూత్ నంబర్ 3లో బీ ఎల్ ఓ కోటేశ్వర రావు, బీ ఎల్ ఏ పరసా శ్రీను కలిసి మోరంపూడి శ్రీనివాస రావు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫార్మ్‌లు పంపిణీ చేశారు.

అదేవిధంగా చనుబండ బూత్ నంబర్ 2లో కూడా బీ ఎల్ ఓ శోభన్ బాబు తో కలిసి మోరంపూడి శ్రీనివాస రావు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వర రావు, కంచు గిరి రాజు, మొండ్రు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.