ఓటరు జాబితా సవరణపై ఇంటింటి ప్రచారం – ఎన్యూమరేషన్ ఫార్మ్లు పంపిణీ
ఓటర్లు జూలై 14 వరకు జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బీ ఎల్ ఓల ద్వారా తమ పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫార్మ్లను నింపి అందజేసి, తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చనుబండ పీ ఏ సీ ఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా చాట్రాయి మండలం చనుబండ గ్రామం బూత్ నంబర్ 3లో బీ ఎల్ ఓ కోటేశ్వర రావు, బీ ఎల్ ఏ పరసా శ్రీను కలిసి మోరంపూడి శ్రీనివాస రావు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫార్మ్లు పంపిణీ చేశారు.
అదేవిధంగా చనుబండ బూత్ నంబర్ 2లో కూడా బీ ఎల్ ఓ శోభన్ బాబు తో కలిసి మోరంపూడి శ్రీనివాస రావు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వర రావు, కంచు గిరి రాజు, మొండ్రు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.