www.ntodaynews.com
పెనుగొలులో ఘనంగా అంతర్జాతీయ గృహ శ్రామికుల దినోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలులో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గృహ శ్రామికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు గృహాల్లో పనిచేసే శ్రామికులు కోటమ్మ, రాణి, సామ్రాజ్యం తదితరులను నూతన వస్త్రాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. శ్రామికుల సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించడం సమాజ బాధ్యత అని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షులు వి. నారాయణరావు, రంగనాయక స్వామి ఆలయ అర్చకులు టీ. యోగానందాచార్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు ఎస్.వి. శ్రీనివాసశాస్త్రి, ఎన్. మురళీ కృష్ణ, అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.