www.ntodaynews.com
తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్స్టేషన్కు నేడు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న 11/33 కెవి విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలిసి పాల్గొననున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.
కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కార్యక్రమాన్ని కవర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.