తొర్రూరు పట్టణంలోని మహాలక్ష్మి క్లాత్ స్టోర్ ప్రారంభోత్సవం
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు
తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన వర మహాలక్ష్మి క్లాత్ సెంటర్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మరియు సమాజం సహకారం అందించాలని అన్నారు. స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం వల్ల ప్రజలకు మంచి నాణ్యత కలిగిన వస్త్రాలు అందుబాటులోకి రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..