దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్
తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్
అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..