తుమ్మగూడెం అగ్నిప్రమాద బాధితురాలికి మంత్రి పార్థసారథి అండ..
చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైన మోదుగుమాటి మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అండగా నిలిచారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించి బాధితురాలికి రూ.5,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది తుమ్మగూడెం గ్రామానికి చేరుకుని మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు సమక్షంలో బాధితురాలు మరియమ్మకు నగదు సహాయాన్ని అందజేశారు.
అపద సమయంలో వెంటనే స్పందించి సహాయం అందించిన మంత్రి పార్థసారథికి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.