BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తుమ్మగూడెం అగ్నిప్రమాద బాధితురాలికి మంత్రి పార్థసారథి అండ..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 04:40 PM
173 వీక్షణలు

చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైన మోదుగుమాటి మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అండగా నిలిచారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి పార్థసారథి వెంటనే స్పందించి బాధితురాలికి రూ.5,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది తుమ్మగూడెం గ్రామానికి చేరుకుని మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజారావు సమక్షంలో బాధితురాలు మరియమ్మకు నగదు సహాయాన్ని అందజేశారు.

అపద సమయంలో వెంటనే స్పందించి సహాయం అందించిన మంత్రి పార్థసారథికి గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.