BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తుమ్మగూడెం పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీ పరిశీలించి – రైతులకు APAIMS 2.0 ద్వారా వివరాలు అందించిన ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 08:25 PM
119 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం పీఏసీఎస్‌ను సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల కేటాయింపు విధానంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చించి వెబ్‌సైట్ వినియోగ విధానాన్ని వివరించారు.

వెబ్‌సైట్‌లో రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసిన వెంటనే పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా దఫాల వారీగా కేటాయించిన డీఏపీ, యూరియా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.

అలాగే APAIMS వెబ్‌సైట్ ద్వారా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు పొందే ప్రక్రియ సులభతరం చేసినట్లు వివరించారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారులు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.