BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తుమ్మగూడెం పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీ పరిశీలించి – రైతులకు APAIMS 2.0 ద్వారా వివరాలు అందించిన ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 08:25 PM
157 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం పీఏసీఎస్‌ను సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల కేటాయింపు విధానంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చించి వెబ్‌సైట్ వినియోగ విధానాన్ని వివరించారు.

వెబ్‌సైట్‌లో రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసిన వెంటనే పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా దఫాల వారీగా కేటాయించిన డీఏపీ, యూరియా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.

అలాగే APAIMS వెబ్‌సైట్ ద్వారా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు పొందే ప్రక్రియ సులభతరం చేసినట్లు వివరించారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారులు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.