BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

తుమ్మగూడెం పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీ పరిశీలించి – రైతులకు APAIMS 2.0 ద్వారా వివరాలు అందించిన ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 08:25 PM
45 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం పీఏసీఎస్‌ను సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల కేటాయింపు విధానంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చించి వెబ్‌సైట్ వినియోగ విధానాన్ని వివరించారు.

వెబ్‌సైట్‌లో రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసిన వెంటనే పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా దఫాల వారీగా కేటాయించిన డీఏపీ, యూరియా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.

అలాగే APAIMS వెబ్‌సైట్ ద్వారా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు పొందే ప్రక్రియ సులభతరం చేసినట్లు వివరించారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారులు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.