www.ntodaynews.com
త్వరగా మహిళా శక్తి భవనాలను పూర్తి చేయాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
త్వరగా మహిళా శక్తి భవనాలను పూర్తి చేయాలి – కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాత మంచిర్యాల ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సమాఖ్యల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ భవనాల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు