www.ntodaynews.com
త్వరలో 2,700 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రానున్న జాబ్ క్యాలెండర్లో 2,700 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ‘వార్ రూమ్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. దీంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో క్రైమ్ రేటు 14.1 శాతం తగ్గిందని, మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గినట్లు వివరించారు.