BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

బడ్జెట్ 2026లో సామాన్యులకు, మధ్యతరగతికి ఊరట

తెలంగాణ
07 Feb, 2026 - 08:14 AM
195 వీక్షణలు
యూనియన్ బడ్జెట్ 2026లో సామాన్యులకు, మధ్యతరగతికి ఊరట పన్ను రాయితీలు, వైద్య ఖర్చుల తగ్గింపు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: చిట్టా మధు NTODAY NEWS: గొల్లప్రోలు రిపోర్టర్: బోర శివారెడ్డి యూనియన్ బడ్జెట్–2026లో సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గొల్లప్రోలు బీజేపీ నాయకుడు చిట్టా మధు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో పన్ను విధానాలు, వైద్య సేవలు, విద్య, ఉపాధి, పర్యాటకం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు గడువును జూలై 31 వరకు పొడిగించడంతో పాటు, రిటర్న్స్‌లో జరిగిన పొరపాట్లను మార్చి 31 వరకు సవరించుకునే అవకాశం కల్పించారని తెలిపారు. ఇది ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. వైద్య రంగానికి సంబంధించి 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయని చెప్పారు. అలాగే విదేశాల్లో చదువు లేదా పర్యటనల కోసం పంపే నగదుపై వసూలు చేసే TCSను 20 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కోర్టు ద్వారా లభించే పరిహారంపై వచ్చే వడ్డీకి ఇకపై పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా సామాన్యులకు మేలు చేస్తుందని తెలిపారు. మహిళా వ్యాపారుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో “షీ మార్ట్స్” ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగానికి పన్ను రాయితీలు పెంచడం వల్ల హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని, క్లౌడ్ డేటా సెంటర్లపై పన్ను మినహాయింపులు టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఫార్మా రంగానికి “బయోఫార్మా శక్తి” పథకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఔషధ పరిశ్రమలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పర్యాటక రంగంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు చేయడం అభినందనీయమని అన్నారు. రైతుల కోసం 500 రిజర్వాయర్ల అభివృద్ధి, తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాలకు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణ సౌలభ్యం పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చిట్టా మధు తెలిపారు. #UnionBudget2026 #CentralBudget #MiddleClassRelief #TaxReforms #HealthcareBenefits #ITSector #WomenEntrepreneurs #TourismDevelopment #RailCorridors Follow us on Website Facebook Instagram YouTube