BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం

తెలంగాణ
18 Jan, 2026 - 08:08 AM
42 వీక్షణలు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. తన జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ అడుగు జాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. అలాగే రాజ్యాంగంపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఉపసర్పంచ్ ఒక వినూత్న ఆలోచనతో ఎంఆర్పీఎస్ నాయకులకు రాజ్యాంగ గ్రంథాలను బహూకరించారు. పాల్గొన్నవారు: ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు కాడిగల్ల బాబు, బొడ్డు రజిత భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, పెంటబోయిన భానుశ్రీ వేణు, మాజీ సర్పంచ్ సుర్వి వేణు గౌడ్, శివగళ్ళ ఇస్తారి, ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు బండమీది శ్రీరామ్ గౌడ్, వార్డు సభ్యులు మంద ఉప్పలయ్య, కడిగల్ల భూపాల్, కడెం బీరప్ప, బొడ్డు శివబాబు, తోట మహేష్, చిలకగూడెం బాబు, మంద ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. #DrBRAmbedkar #AmbedkarThoughts #ConstitutionOfIndia #SocialJustice #MRPS #KnowledgeMovement #Ambedkarite #DalitMovement #YouthAwareness #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube