BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 January 2026, 08:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం

తెలంగాణ
18 Jan, 2026 - 08:08 AM
197 వీక్షణలు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 30వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. తన జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ అడుగు జాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. అలాగే రాజ్యాంగంపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఉపసర్పంచ్ ఒక వినూత్న ఆలోచనతో ఎంఆర్పీఎస్ నాయకులకు రాజ్యాంగ గ్రంథాలను బహూకరించారు. పాల్గొన్నవారు: ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు కాడిగల్ల బాబు, బొడ్డు రజిత భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, పెంటబోయిన భానుశ్రీ వేణు, మాజీ సర్పంచ్ సుర్వి వేణు గౌడ్, శివగళ్ళ ఇస్తారి, ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు బండమీది శ్రీరామ్ గౌడ్, వార్డు సభ్యులు మంద ఉప్పలయ్య, కడిగల్ల భూపాల్, కడెం బీరప్ప, బొడ్డు శివబాబు, తోట మహేష్, చిలకగూడెం బాబు, మంద ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. #DrBRAmbedkar #AmbedkarThoughts #ConstitutionOfIndia #SocialJustice #MRPS #KnowledgeMovement #Ambedkarite #DalitMovement #YouthAwareness #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube