www.ntodaynews.com
మంచిర్యాల అభివృద్ధికి బీజేపీయే ఏకైక మార్గం
తెలంగాణ
మంచిర్యాల అభివృద్ధికి బీజేపీయే ఏకైక మార్గం: ఎన్నికల ప్రచార సభలో దేవేంద్ర ఫడ్నవీస్
NTODAY NEWS: మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాస్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు.
మంచిర్యాల తనకు ఎంతో సుపరిచితమైన ప్రాంతమని, ఇక్కడి వీధులు, టాకీసులతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని ఫడ్నవీస్ గుర్తు చేశారు. గోదావరి నది తీరాన ఉన్నా కూడా మంచిర్యాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
మతపరమైన రిజర్వేషన్ల అంశంపై స్పందించిన ఫడ్నవీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కులను బీజేపీ కాపాడుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలో బీజేపీ మేయర్గా ముకేశ్ గౌడ్ ఎన్నికైన వెంటనే మహారాష్ట్ర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసుకువచ్చి నగరంలో ప్రతిష్ఠిస్తామని కీలక ప్రకటన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ పథకాల నిధులు నేరుగా ప్రజలకు అందాలంటే మంచిర్యాలలో కాషాయ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
#Mancherial #BJP #MunicipalElections #DevendraFadnavis #SmartCity #AmritCity #TelanganaPolitics #ElectionCampaign
Follow us on
Website
Facebook
Instagram
YouTube