BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి

తెలంగాణ
08 Feb, 2026 - 08:37 AM
303 వీక్షణలు
కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రజలను 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 1, 4, 7, 8, 9, 15 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ‘అభయహస్తం’ అంటూ ఆశలు కల్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారిందని వ్యాఖ్యానించారు. అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్లిందని, యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. రెండేళ్లుగా సంక్షేమం కుంటుపడినా ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నిరుద్యోగులను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధర్మపురిలో సుమారు రూ.9 కోట్లతో మాతా–శిశు ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఫర్నిచర్, వైద్యులు, సిబ్బంది కేటాయించక ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందని ప్రశ్నించారు. అభివృద్ధి పరంపర కొనసాగాలంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #DharmapuriMunicipalElections #BRS #KoppulaEshwar #CongressFailures #UrbanDevelopment #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube