www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
పాల్గొన్న తొలి జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: జగిత్యాల న్యూస్ శనివారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల మరియు రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, రాష్ట్ర నాయకుడు ఓరుగంటి రమణారావు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
#MunicipalElections
#BRSParty
#Jagtial
#Raikal
#ElectionPreparation
#PoliticalMeeting
#TelanganaPolitics
Follow us on
Website
Facebook
Instagram
YouTube
