జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
నిర్వహణ లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు-- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు
జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యత యూతం గా పని చేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవిన్యూ,పంచాయతీ, విద్య శాఖ,మాస్టర్ ట్రైనర్ లకు, పి.ఓ, ఓ.పిఓ, మైక్రో అబ్సర్వర్ లకు, జోనల్,రూట్ అధికారులకు, హెల్త్, అంగన్వాడీ టీచర్లకు, విద్యుత్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ.. ఇలా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు అలాగే....ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాల పైన విస్తృత కవరేజ్ ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube