రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో భేటీ అయిన పోలవరం ఎమ్మెల్యే
NTODAY NEWS: జిలుగుమిల్లి రిపోర్టర్ వీరమల్ల శ్రీను
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గంలోని మౌలిక వసతుల అభివృద్ధి, ముఖ్యంగా రహదారి నిర్మాణాల కోసం సుమారు 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. అలాగే కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదనంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నాయకుల మధ్య సుమారు ఒక గంట పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube