BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ

తెలంగాణ
29 Dec, 2025 - 08:27 AM
265 వీక్షణలు

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

సంక్రాంతికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంతో పాటు వెలిమినేడు, పెద్ద కాపర్తి ప్రాంతాల్లో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను వెంటనే మరమ్మతులు చేయాలని, అలాగే పట్టణ పరిధిలో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా వదిలేసిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుపై తగిన ఏర్పాట్లు చేయాలని, బ్రిడ్జి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీసు సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube