BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ

తెలంగాణ
29 Dec, 2025 - 08:27 AM
314 వీక్షణలు

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

సంక్రాంతికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంతో పాటు వెలిమినేడు, పెద్ద కాపర్తి ప్రాంతాల్లో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను వెంటనే మరమ్మతులు చేయాలని, అలాగే పట్టణ పరిధిలో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా వదిలేసిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుపై తగిన ఏర్పాట్లు చేయాలని, బ్రిడ్జి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీసు సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube