రాచన్నగూడెంలో పల్లె నిద్ర కార్యక్రమం పాల్గొన్న సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై వి.క్రాంతి కుమార్
NTODAY NEWS: జీలుగుమిల్లి రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా:- జీలుగుమిల్లి మండలం, రాచన్నగూడెం గ్రామంలో సిఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై వి.క్రాంతి కుమార్ తమ సిబ్బందితో కలిసి "పల్లె నిద్ర" కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రామస్థులతో గ్రామ వివరాలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.అదేవిధంగా గ్రామస్తులకు పేకాట, కోడిపందేలు జూదం వంటివి ఆడొద్దు అని, మత్తు పదార్థాలకు దూరం ఉండాలని అన్నారు. యువత మంచి మార్గంలో వెళ్ళి ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు పొందాలని కోరారు.పేదలకు ఉన్న ఏకైక ఆస్తి చదువే అని తెలిపారు.గ్రామంలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఎవ్వరు అయిన చేపట్టితే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు.అనంతరం గ్రామంలో చదువుకుంటున్న చిన్న పిల్లలతో చదువు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలీస్ సిబ్బంది లక్ష్మణ్, మహేష్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube