www.ntodaynews.com
నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ ఎజెండా
తెలంగాణ
నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ ఎజెండా, రాష్టం అప్పులతో కొరుకుపోయిన ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు హామీని నిరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికీ కృతజ్ఞతలు.. డా"వరిగుంతం కృష్ణ
(NTODAY NEWS లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి )
నర్సాపూర్. హత్నూర మండల్ నస్తీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారూలు ఎల్లకొండ అంసమ్మ వెంకటయ్య ఇల్లు శంకుస్థాపన కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డా"వరిగుంతం కృష్ణ పాల్గొని. గత పది ఏళ్లలో బి.ఆర్ఎ.స్ ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రామాలలో ఏ ఒక్కరికి ఇవ్వలేక విఫలమైందని. తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే అర్హత ఉన్న నిరుపేద కుటుంబంలందరికి విడతలవారీగా పక్క ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇస్తుందని ఏద్దేవాచేశారు. తమ గ్రామంలొ ఇందిరమ్మ కమిటీ నిర్దారించిన పది ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు అందించగా MLA కోటాలో రావలసిన మరో నాలుగు ఇందిరమ్మ ఇండ్లు జిల్లా కలెక్టర్ వద్ద పరిశీలనలో ఉన్నట్టు అయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలొ నస్తీపూర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ యాదయ్య. యూత్ కాంగ్రెస్ నాయకులు వరిగుంతం హరీష్, ఎల్లకొండ సుధాకర్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube