ఉదయం 10:30 దాటినా తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం.. విధులపై సిబ్బంది నిర్లక్ష్యమా?
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం ఉదయం 10:30 గంటలు దాటినా తెరవకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ప్రభుత్వ సేవల కోసం వచ్చిన ప్రజలు సచివాలయం ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా నిర్ణీత సమయానికి ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయం తెరవకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల వివరాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రజలకు సకాలంలో సేవలు అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కొంతమంది సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సచివాలయం ఆలస్యంగా తెరవడానికి గల కారణాలను గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.