BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఉదయం 10:30 దాటినా తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం.. విధులపై సిబ్బంది నిర్లక్ష్యమా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 12:32 PM
88 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం ఉదయం 10:30 గంటలు దాటినా తెరవకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ప్రభుత్వ సేవల కోసం వచ్చిన ప్రజలు సచివాలయం ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా నిర్ణీత సమయానికి ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయం తెరవకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల వివరాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రజలకు సకాలంలో సేవలు అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కొంతమంది సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సచివాలయం ఆలస్యంగా తెరవడానికి గల కారణాలను గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.