ఉజ్వల పథకంతో రూ.550కే గ్యాస్ సిలిండర్
ఉజ్వల పథకంతో రూ.550కే గ్యాస్ సిలిండర్
పేద కుటుంబాల మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.550 నుంచి రూ.642 మధ్య ధరకు లభిస్తోంది.
ప్రతి సిలిండర్పై రూ.300 వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే కొత్తగా ఎంపికైన అర్హులైన మహిళలకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కనెక్షన్, తొలి గ్యాస్ రీఫిల్, వంట స్టవ్ను ఉచితంగా అందజేస్తోంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి. అర్హతలు ఉన్న మహిళలు సమీప గ్యాస్ పంపిణీ కేంద్రంలో లేదా అధికారిక మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.