www.ntodaynews.com
మున్సిపల్ చైర్పర్సన్గా ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ
చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్గా పందిరి గీత ఏకగ్రీవ ఎన్నిక
వైస్ చైర్పర్సన్గా గుండెబోయిన శ్రీలక్ష్మి ప్రమాణ స్వీకారం
NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా
చిట్యాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు మహిళలకు దక్కాయి. 12వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పందిరి గీత రమేష్ చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్యాల చరిత్రలో తొలి మహిళా చైర్పర్సన్గా ఆమె నిలిచారు.
సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
చైర్పర్సన్ ఎన్నికలో 6వ వార్డు కాంగ్రెస్ సభ్యుడు జెర్రిపోతుల సత్యనారాయణ పందిరి గీత పేరును ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యుడు ఏర్పుల పరమేష్ బలపరిచారు. ఒక్కటే ప్రతిపాదన రావడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
అనంతరం జరిగిన వైస్ చైర్పర్సన్ ఎన్నికలో 8వ వార్డు సభ్యుడు కుక్కల మోహన్, 5వ వార్డు సభ్యురాలు గుండెబోయిన శ్రీలక్ష్మి పేరును ప్రతిపాదించగా, 11వ వార్డు సభ్యురాలు మునగాల సందీప బలపరిచారు. ఈ పదవికి కూడా ఒక్కటే ప్రతిపాదన రావడంతో గుండెబోయిన శ్రీలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారి నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు నియామక పత్రాలు అందజేశారు.
#Chityal #NalgondaDistrict #MunicipalElections #WomenLeadership #LocalGovernance #CongressParty #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube