BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 05:43 PM
33 వీక్షణలు

ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.9 కోట్లు వెంటనే విడుదల చేసి ఉపాధి కూలీలకు చెల్లించాలని సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు కోరారు.

విసన్నపేట మండలం చండ్రుపట్ల ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని సందర్శించిన నాయకులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే, చేసిన పనులకు సంబంధించిన కూలి డబ్బులు సమయానికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

ఈ సందర్భంగా కోట కళ్యాణ్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.

ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, నాగలక్ష్మి, కృష్ణవేణి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.