BREAKING
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
www.ntodaynews.com

ఉపాధి హామీ కూలీల సమస్యలపై లిబరేషన్ పార్టీ ఆందోళన.. ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:48 PM
7 వీక్షణలు

వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ పనులను సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా కార్మికులు హాజరు నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో వారి ఉపాధి హక్కు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కార్మికులకు రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ప్రభుత్వం 125 రోజుల పనిదినాలను ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల కేవలం 100 రోజుల పనికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి వ్యవసాయ కూలీకి పూర్తి స్థాయిలో 125 రోజుల పని దొరికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పని ప్రదేశాల్లో మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, గ్రామానికి 5 కిలోమీటర్లకు మించి పని ప్రదేశం ఉంటే రవాణా భత్యం చెల్లించాలని కోరారు. మండుతున్న ఎండల నేపథ్యంలో సమ్మర్ అలవెన్స్‌గా 30 శాతం అదనపు వేతనం ఇవ్వాలని, 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు, వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.