BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఉపాధి హామీ కూలీల సమస్యలపై లిబరేషన్ పార్టీ ఆందోళన.. ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:48 PM
14 వీక్షణలు

వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ పనులను సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా కార్మికులు హాజరు నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో వారి ఉపాధి హక్కు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కార్మికులకు రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ప్రభుత్వం 125 రోజుల పనిదినాలను ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల కేవలం 100 రోజుల పనికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి వ్యవసాయ కూలీకి పూర్తి స్థాయిలో 125 రోజుల పని దొరికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పని ప్రదేశాల్లో మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, గ్రామానికి 5 కిలోమీటర్లకు మించి పని ప్రదేశం ఉంటే రవాణా భత్యం చెల్లించాలని కోరారు. మండుతున్న ఎండల నేపథ్యంలో సమ్మర్ అలవెన్స్‌గా 30 శాతం అదనపు వేతనం ఇవ్వాలని, 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు, వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.