BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఉపాధి హామీలో ‘మామూళ్ల’ దందా!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:06 PM
84 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద కూలీలకు ఉపాధి కల్పించాల్సిన పథకం కొందరు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదాయ వనరుగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో పనులకు మస్టర్లు వేయడం, కొత్తగా పేర్లు నమోదు చేయడం, చేసిన పనుల కొలతలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి ప్రక్రియల కోసం కూలీల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, సాంకేతిక సహాయకుల పేరుతో ఈ వసూళ్లు జరుగుతున్నాయని కూలీలు చెబుతున్నారు.

డబ్బులు ఇవ్వని కూలీలపై వివక్ష చూపుతూ, వారి పనిదినాలు తగ్గించడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు సాంకేతిక సహాయకులు పని ప్రదేశాలకు వెళ్లకుండానే కార్యాలయాల్లో కూర్చొని కొలతలు నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో అక్రమాలు మరింత పెరిగిపోయాయని కూలీలు వాపోతున్నారు. పారదర్శకత లేకపోవడంతో ఉపాధి హామీ పథకం లక్ష్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, కూలీలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.