BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఉపాధి కూలీలపై కఠిన నిబంధనలు.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:05 PM
136 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చిత్తపూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఆరోపించారు.

ఉపాధి హామీ పనులకు వెళ్లిన దళిత కూలీలకు రెండు అడుగుల లోతు, ఒక మీటర్ పొడవు, ఒక మీటర్ వెడల్పుతో గుంత తవ్వి, 15 అడుగుల ఎత్తులో ఉన్న కట్టపై మట్టిని వేయాలని సిబ్బంది నిబంధన విధిస్తున్నారని తెలిపారు. ఎండాకాలం కారణంగా భూమి గట్టిపడిపోయి ఉండటంతో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కూలీలు వాపోయారు.

ఈ నిబంధనలను సడలించాలని కోరగా, "మీ ఇష్టమైతే పని చేయండి, లేకపోతే వెళ్లిపోండి. మాకు ఎంపీడీఓ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందే" అంటూ అధికారులు నిర్దాక్షిణ్యంగా స్పందించారని కూలీలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పనిస్థలంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆరోపించారు. దీంతో సీపీఐ(ఎంఎల్) కార్యకర్తలు స్వచ్ఛందంగా వాటర్ క్యాన్ల ద్వారా కూలీలకు మంచినీరు అందించారు.

వారం రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, పనులు ప్రారంభమవడంతో జీవనోపాధికి ఊరట లభిస్తుందని భావించిన సమయంలో ఈ కఠిన నిబంధనల కారణంగా మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు తెలిపారు.

ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఉపాధి కార్మికుల సమస్యలను సహానుభూతితో పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కలపాల వెంకటేశ్వరరావు హెచ్చరించారు.