BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 31 August 2026, 08:10 pm
Posted by : కూనురు మధు

ఉరుమడ్లలో పలు కార్యక్రమాల్లో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
31 Aug, 2026 - 08:10 PM
20 వీక్షణలు

ఉరుమడ్లలో పలు కార్యక్రమాల్లో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి 

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ముత్యాలమ్మ, మారెమ్మ, పాపమ్మ ఆలయాల నిర్మాణంలో భాగంగా నిర్వహించిన ధ్వజ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఊర చెరువు వద్ద ముత్యాలమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.


అనంతరం ఉరుమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన గుత్తా అమిత్ రెడ్డి.. 8, 9, 10వ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.