వాముకుంట్లలో గ్రామసభ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ
వాముకుంట్లలో గ్రామసభ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం
ఆగస్టు 14: ఒక నెల – ఒక గ్రామం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండలం వాముకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ హాజరై గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ ప్రజలు తమ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చి అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన ఆర్డీఓ.. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామంలో మౌలిక వసతులు, రెవెన్యూ పరమైన సమస్యలు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, గ్రామ పెద్దలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.