వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు ఖరీఫ్ సాగు, పంటల ఎంపిక, పంటల బీమాపై అవగాహన కల్పించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో బోరు సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. మిగతా రైతులు మినుములు, పెసలు, జొన్నలు, రాగులు వంటి ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అపరాల పంటల నమోదుకు మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉందని, వరి పంట నమోదుకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కోరారు.
యూరియా కొనుగోలు చేసే రైతులు ఏపీఎం–ఏఐఎంఎస్లో నమోదు చేసుకోవాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శులు మురళి, శ్రీరామ్మూర్తి, రైతు సేవా కేంద్రం సిబ్బంది స్వాతి, రాజేష్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.