BREAKING
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన..
www.ntodaynews.com

వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 05:08 PM
26 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు ఖరీఫ్ సాగు, పంటల ఎంపిక, పంటల బీమాపై అవగాహన కల్పించారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో బోరు సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. మిగతా రైతులు మినుములు, పెసలు, జొన్నలు, రాగులు వంటి ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని తెలిపారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అపరాల పంటల నమోదుకు మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉందని, వరి పంట నమోదుకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కోరారు.

యూరియా కొనుగోలు చేసే రైతులు ఏపీఎం–ఏఐఎంఎస్‌లో నమోదు చేసుకోవాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శులు మురళి, శ్రీరామ్మూర్తి, రైతు సేవా కేంద్రం సిబ్బంది స్వాతి, రాజేష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.