www.ntodaynews.com
వైఎస్సార్ ఘాట్ సాక్షిగా అంబటి రాంబాబు ప్రతిజ్ఞ
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ ఘాట్ సాక్షిగా అంబటి రాంబాబు ప్రతిజ్ఞ
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.
ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం వరకూ అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.