BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

వైరాలో మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 07:34 PM
23 వీక్షణలు

వైరాలో మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు

ఖమ్మం జిల్లా, వైరా, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా పట్టణంలో బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మధిర మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 29వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో సీనియర్ నాయకుడు పి. సోమయ్య మాట్లాడుతూ, బోడేపూడి వెంకటేశ్వరరావు పేద ప్రజల హక్కుల కోసం అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాడిన ప్రజానాయకుడని అన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రత్యేక గుర్తింపు పొందారని, సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయనను గౌరవించేవారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.