BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

వడ్లమాను గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:08 PM
17 వీక్షణలు

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభ శేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి వడ్లమాను గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, నూతన క్రిమినల్ చట్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, బాలలపై లైంగిక నేరాలపై ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే విధానం, పోలీసుల సహకారం గురించి వివరించారు. చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలను తెలియజేశారు.

అదేవిధంగా నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పులు, వాటి అమలు విధానం, ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందిస్తే తక్షణ పోలీసు సహాయం అందుతుందని తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని చట్టాలు, భద్రతా చర్యలపై అవగాహన పొందారు.