BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

వెల్లంకి గ్రామంలో కోతుల నియంత్రణకు చర్యలు | సర్పంచ్ చొరవ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 02:16 PM
274 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కోతుల ఉనికి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడడం, పంటలను నాశనం చేయడం వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.

ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో కోతులను బంధించేందుకు ప్రత్యేక బోనులు తయారు చేయించారు. గ్రామస్థుల సమస్యలపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.

ఈ రోజు గ్రామంలో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను పిలిపించి, సుమారు 100 కోతులను బంధించడం జరిగింది. ఈ చర్య ద్వారా గ్రామంలో కొంతవరకు ఉపశమనం లభించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం కొత్త బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుకున్న కోతులను శ్రీశైలం అడవులు లో విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పారు.

గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, సెక్రెటరీ మోహన్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.