BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

వెల్లంకి గ్రామంలో కోతుల నియంత్రణకు చర్యలు | సర్పంచ్ చొరవ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 02:16 PM
249 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కోతుల ఉనికి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడడం, పంటలను నాశనం చేయడం వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.

ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో కోతులను బంధించేందుకు ప్రత్యేక బోనులు తయారు చేయించారు. గ్రామస్థుల సమస్యలపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.

ఈ రోజు గ్రామంలో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను పిలిపించి, సుమారు 100 కోతులను బంధించడం జరిగింది. ఈ చర్య ద్వారా గ్రామంలో కొంతవరకు ఉపశమనం లభించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం కొత్త బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుకున్న కోతులను శ్రీశైలం అడవులు లో విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పారు.

గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, సెక్రెటరీ మోహన్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.