BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వెల్లంకి గ్రామంలో కోతుల నియంత్రణకు చర్యలు | సర్పంచ్ చొరవ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 02:16 PM
316 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కోతుల ఉనికి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడడం, పంటలను నాశనం చేయడం వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.

ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో కోతులను బంధించేందుకు ప్రత్యేక బోనులు తయారు చేయించారు. గ్రామస్థుల సమస్యలపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.

ఈ రోజు గ్రామంలో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను పిలిపించి, సుమారు 100 కోతులను బంధించడం జరిగింది. ఈ చర్య ద్వారా గ్రామంలో కొంతవరకు ఉపశమనం లభించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం కొత్త బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుకున్న కోతులను శ్రీశైలం అడవులు లో విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పారు.

గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, సెక్రెటరీ మోహన్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.