వెల్లంకి గ్రామంలో కోతుల నియంత్రణకు చర్యలు | సర్పంచ్ చొరవ
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కోతుల ఉనికి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడడం, పంటలను నాశనం చేయడం వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.
ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో కోతులను బంధించేందుకు ప్రత్యేక బోనులు తయారు చేయించారు. గ్రామస్థుల సమస్యలపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.
ఈ రోజు గ్రామంలో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను పిలిపించి, సుమారు 100 కోతులను బంధించడం జరిగింది. ఈ చర్య ద్వారా గ్రామంలో కొంతవరకు ఉపశమనం లభించింది.
ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం కొత్త బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుకున్న కోతులను శ్రీశైలం అడవులు లో విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పారు.
గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, సెక్రెటరీ మోహన్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.