BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
03 Jun, 2026 - 07:01 PM
9 వీక్షణలు

వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు

మాజీ మంత్రి విడదల రజిని వెల్లడి

చిలకలూరిపేట, జూన్ 3: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విడదల రజిని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలు మరియు చిలకలూరిపేట పట్టణంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాను యడ్లపాడు మండల కేంద్రంలో నిర్వహించే నిరసనలో పాల్గొంటానని రజిని వెల్లడించారు.

అలాగే ఈ నెల 8వ తేదీన మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు, జూన్ 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.