BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థుల ఆందోళనలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల రద్దు హర్షణీయం: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత డి. హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 04:51 PM
54 వీక్షణలు

మంగళవారం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ స్వాగతించారు. 2026 జూలై 20 నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం హర్షించదగిన చర్య అని పేర్కొన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులన్నింటినీ మూసివేసినట్లుగా పరిగణించాలని ఆదేశించిందని తెలిపారు. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారిగా గుర్తించిన ఢిల్లీలోని 2,873 మందికి మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం, అలాగే బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఉపశమనం కల్పించాలని సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని హరినాథ్ తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిర్వహించాల్సిన ప్రతిపాదిత నిరసన ర్యాలీని సిపిఐ విరమించుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య నిరసనల పరిరక్షణలో ఈ తీర్పు కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.