విద్యార్థుల కోరికను వెంటనే నెరవేర్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా క్రికెట్ కిట్ పంపిణీ
మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ విద్యార్థుల్లో ఆనందం
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు ఇటీవల మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడిన సందర్భంగా, తమకు క్రికెట్ కిట్ అందించాలని విద్యార్థులు ఎంపీ గారిని కోరారు. విద్యార్థుల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఎంపీ గారు, వారి కోరికను నెరవేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో గౌరవనీయ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, విద్యార్థులకు అవసరమైన క్రీడా సదుపాయాలను కల్పించేందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు నిరంతరం కృషి చేస్తున్నారని పలువురు అభినందించారు. విద్యార్థుల అభివృద్ధితో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. క్రికెట్ కిట్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి, మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు