BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

సివిల్ సప్లై కార్మికుల వేతనాలు ఒకేసారి చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 04:23 PM
10 వీక్షణలు

బడ్జెట్ సాకుతో విడతల వారీగా ఇవ్వడం అన్యాయం: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల దాసు

మంచిర్యాల :సివిల్ సప్లై (పౌర సరఫరాల) శాఖలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మేకల దాసు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన సివిల్ సప్లై కార్మికులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. కార్మికులకు నెలకు రెండుసార్లు కాకుండా ఒకేసారి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లేదనే సాకుతో కార్మికుల కష్టార్జితాన్ని విడతల వారీగా చెల్లించడం దారుణమన్నారు. ఇది కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కార్మికుల వేతనాల చెల్లింపులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు