BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
43 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం: నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల స్థలంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ జి. నాగరాజు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు అదనపు భవనాలు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే పాఠశాల స్థలంలో కాలనీలు నిర్మించబడటంతో, ఆదివారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్ డి. లలిత, సభ్యులు వి. లావణ్య, ఎం. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.