BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలని వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
19 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం: నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాల స్థలంలో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ జి. నాగరాజు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు అదనపు భవనాలు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే పాఠశాల స్థలంలో కాలనీలు నిర్మించబడటంతో, ఆదివారాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్ డి. లలిత, సభ్యులు వి. లావణ్య, ఎం. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.