BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ట్రంప్ మెప్పుకోసమే ఎల్పీజీ దిగుమతులా? వ్యూహాత్మక నిర్ణయమా?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 05:54 PM
71 వీక్షణలు

న్యూఢిల్లీ, జూన్ 22: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన ఎల్పీజీ దిగుమతుల వ్యూహంలో కీలక మార్పులు చేపట్టింది. గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ అమెరికా, ఇరాన్ సహా పలు దేశాల నుంచి వంటగ్యాస్ దిగుమతులను పెంచింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

గతంలో భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వచ్చేది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, సరఫరాపై నెలకొన్న అనిశ్చితి కారణంగా దిగుమతుల మూలాలను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ క్రమంలో అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరిలో 8 శాతంగా ఉన్న అమెరికా వాటా ఏప్రిల్ నాటికి సుమారు 33 శాతానికి చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

అమెరికాతో 2025 చివరలో కుదిరిన 2.2 మిలియన్ టన్నుల సరఫరా ఒప్పందం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఉపశమనంగా మారిందని ఇంధన రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో చాలా కాలం తర్వాత ఇరాన్ నుంచి కూడా ఎల్పీజీ దిగుమతులు ప్రారంభమయ్యాయి. అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి కూడా సరఫరాలు కొనసాగుతున్నాయి.

అయితే సుదూర దేశాల నుంచి దిగుమతుల కారణంగా రవాణా వ్యయాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై భారం పడింది. ఫలితంగా దేశీయ వినియోగం కూడా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఎల్పీజీ ధరలు కూడా భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగుమతులను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా పలు దేశాలకు విస్తరించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.