BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 05:54 PM
86 వీక్షణలు

చాట్రాయి, జూన్ 22: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు, రెవెన్యూ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు గ్రామాల్లోని ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య రంగాలు కీలకమని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సుమారు 35 శాతం వాటా ఈ రంగాలదేనని తెలిపారు.

రైతు కుటుంబాల సర్వే ఆధారంగా రానున్న ఐదేళ్లలో రైతుల అభివృద్ధికి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మద్దతు ధరలు అనే ఐదు ప్రధాన అంశాలపై కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు.

డ్రిప్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, పశుసంపద అభివృద్ధి, మత్స్య సంపద ప్రోత్సాహం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల ఆన్‌లైన్ పంపిణీ వ్యవస్థ, సమతుల్య ఎరువుల వినియోగంపై సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

చిన్నంపేట, బూరుగుడెం గ్రామాల్లో రైతులతో నిర్వహించిన సమావేశాల్లో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.