విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష
శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు.. భువనేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
ఆత్మకూరు: NTODAY NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆదేశాల మేరకు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వెలుగోడు మండలం, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు.
విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు.